Trending Now

పదో తరగతి పరీక్షల ఫలితాలలో నిర్మల్ జిల్లాకు ప్రథమ స్థానం..

నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కేక్ కట్ చేసి సంబరాలు..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 30 : పదో తరగతి పరీక్షల ఫలితాలలో నిర్మల్ జిల్లా సత్తా చాటింది. 99.O5 శాతం మార్కులతో తెలంగాణ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.8908 మంది విద్యార్థులకు గాను 8823 ఉత్తీర్ణులై రాష్ట్రంలోనే తమదైన సత్తాను చాటారు. ఆదిలాబాద్ జిల్లా 17వ స్థానంలో నిలువగా, మంచిర్యాల జిల్లా 20వ స్థానంలో, ఆసిఫాబాద్ 31 స్థానంలో నిలిచింది. దీంతో నిర్మల్ జిల్లాలో ఇటు విద్యార్థులలోనూ అటు ఉపాధ్యా వర్గాలలో సంబరాలు మొదలయ్యాయి. గత ఏడాది కూడా నిర్మల్ జిల్లా పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ప్రథమ స్థానంలో నిలువగా ఈ యేడు కూడా ఆదే స్థానాన్ని అధిగమించడంతో వారి ఉత్సహం మరింత పెరిగింది.

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తో సంబరాలు..

పదవ తరగతి పరీక్ష ఫలితాలలో నిర్మల్ జిల్లా ప్రథమ స్థానంలో నిలవడంతో నిర్మల్ జిల్లా కలెక్టర్ అశీష్ సంగ్వాన్,జిల్లా విద్యాధికారి రవీందర్ రెడ్డి ఉపాధ్యాయ సంఘాల నాయకులు ,ఉపాధ్యాయులు కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కు జిల్లా విద్యాధికారి రవీందర్ రెడ్డి బోకెను అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు.స్వీట్లను తినిపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ఉత్తమ స్థానము లభించేందుకు ప్రణాళిక అబద్ధమైన రీతిలో కష్టపడ్డ విద్యాశాఖ సిబ్బంది ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు భవిష్యత్తు కార్యచరణ రూపొందించుకొని ఉన్నత స్థాయి శిఖరాలను అధిరోహించేందుకు సామాజిక, సాంకేతికపరమైన రంగాలను ఎంచుకొని ముందుకెళ్లాలని సూచించారు. కాలానికి అనుగుణంగా విద్య వైజ్ఞానిక రంగాలలో వస్తున్న మార్పులను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు ఆధార కోర్సులోనే ఎంచుకొని ఉన్నత స్థాయి చదువులకై సిద్ధం కావాలని సలహా ఇచ్చారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి భవిష్యత్తు చదువుల కోసం విద్యార్థులకు అన్ని విధాల సహకరించాలని పేర్కొన్నారు.

జిల్లా విద్యాధికారి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. పదవ తరగతి పరీక్ష ఫలితాలలో నిర్మల్ జిల్లా రెండవసారి ప్రథమ స్థానాన్ని సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. సెకండరీ విద్యాశాఖ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో అన్ని కేంద్రాలలో పరీక్షలను పకడ్బందీగా ప్రణాళికబద్ధమైన రీతిలో నిర్వహించుకోవడం జరిగిందని చెప్పారు. ఒక ప్రణాళికతో పరీక్షలు నిర్వహించడం కారణంగానే జిల్లాలో పదవ తరగతి పరీక్షలలో ప్రథమ స్థానం రావడం జరిగిందని పేర్కొన్నారు. అన్ని పరీక్ష కేంద్రాలలో పూర్తిస్థాయి మౌలిక వసతుల కల్పనతో పాటు ముందస్తు నియమ నిబంధనలు జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని చెప్పారు. ఇక్కడ కూడా ఇలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఇటు విద్యార్థులకు అటు ఉపాధ్యాయులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించడం జరిగిందని చెప్పారు. పరీక్షల నిర్వహణకు సహకరించిన సంబంధిత ఉన్నత స్థాయి అధికారులు విద్యాశాఖ సిబ్బంది ఉపాధ్యాయులకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూనే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Spread the love

Related News