Trending Now

పబ్‌లో బౌన్సర్ల దాడి..

కేసు నమోదు చేసిన పోలీసులు..

హైదరాబాద్, ప్రతి పక్షం స్టేట్ బ్యూరో: రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పబ్‌లో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పబ్‌లో సర్వర్ కెప్టెన్‌గా కృతిక్(23) అనే యువకుడు పని చేస్తున్నాడు. అదే పబ్ లో బౌన్సర్‌గా అమీర్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. కృతిక్, అమీర్‌ల మధ్య ఘర్షణ చెలరేగింది. కృతిక్‌తో పాటు అతని అన్న, స్నేహితులపై అమీర్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. గాయపడిన ఇద్దరినీ చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో మల్లికార్జున్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండగా.. కల్యాణ్ అనే వ్యక్తి కాలితో పాటు చేతిపై గాయాలయ్యాయి. దాడికి పాల్పడ్డ అమీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love

Related News

Latest News