Trending Now

ఆధ్యాత్మికోత్సవానికి రేపు రాష్ట్రపతి శ్రీకారం..

ప్రతిపక్షం, హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని కాన్హా శాంతివనంలో రేపటి నుంచి నాలుగు రోజుల పాటు జరిగే గ్లోబల్ గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవ్-2024 నను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రేపు ప్రారంభిస్తారు. కేంద్ర పర్యాటకశాఖ, శ్రీ రామచంద్ర మిషన్ సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. దేశవిదేశాలకు చెందిన మూడు వందల మందికి పైగా ఆధ్యాత్మిక గురువులు, మఠాధిపతులు, పీఠాధిపతులు పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవాలకు హాజరవుతారు. ప్రపంచంలోని అన్ని మతాల సారాన్నిఒక చోట చేర్చి, విశ్వశాంతి వైపు నడపడం ఈ ఉత్సవ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కాగా ఎల్లుండి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ ఈ ఉత్సవాలకు హాజరవుతారు.

Spread the love