Trending Now

IPL 2024: నేడు రాజస్థాన్‌తో ఢిల్లీ ‘ఢీ’

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో ఇవాళ రాజస్థాన్ రాయల్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. రాజస్థాన్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఆ జట్టు 10 మ్యాచ్‌లు ఆడి 8 గెలిచింది. మరోవైపు ఢిల్లీ పడుతూ లేస్తూ తన జర్నీ కొనసాగిస్తోంది. ఆ జట్టు ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి 5 గెలిచి ఆరింట్లో ఓడిపోయింది. ఇవాళ జరిగే మ్యాచ్ ఢిల్లీకి కీలకంగా మారనుంది.

సూర్య సెంచరీ.. ముంబై గ్రాండ్ విక్టరీ

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గ్రాండ్ విక్టరీ సాధించింది. 7 వికెట్ల తేడాతో SRHను చిత్తు చేసింది. 169 పరుగుల టార్గెట్‌ను ఆ జట్టు 17.2 ఓవర్లలో చేధించింది. జట్టులో సూర్యకుమార్ యాదవ్ (102) సెంచరీతో చెలరేగారు. అతడికి తిలక్ వర్మ (37) సహకారం అందించారు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్, కమిన్స్, జాన్సెన్ తలో వికెట్ తీశారు.

సూర్యకుమార్ మరో రికార్డ్..

ముంబై ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మరో రికార్డు సాధించారు. టీ20ల్లో 6 సెంచరీలు చేసిన ఐదో భారత బ్యాటర్‌గా ఆయన నిలిచారు. SRHతో మ్యాచ్‌లో సూర్యకుమార్ ఈ ఘనత సాధించారు. అగ్ర స్థానంలో విరాట్ కోహ్లీ (9 సెంచరీలు) ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ (8), రుతురాజ్ గైక్వాడ్ (6), కేఎల్ రాహుల్ (6) కొనసాగుతున్నారు.

Spread the love

Related News