ప్రతిపక్షం ప్రతినిధి, నకిరేకల్: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ కొలను శివరాం రెడ్డి ఆధ్వర్యంలో.. చిట్యాల పురపాలిక కేంద్రంలో శుక్రవారం కేంద్ర ప్రభుత్వ బలగాలతో పోలీసులు కవాతు నిర్వహించారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన లు జరగకుండా కేంద్ర బలగాలు, చిట్యాల పోలీసులు ఈ కవాతు చేపట్టారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని డి.ఎస్.పి శివరాం రెడ్డి ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సీఐ నాగరాజు, ఎస్సై సైదా బాబు, స్థానిక సిబ్బంది ఈ కవాతులో పాల్గొన్నారు.