Trending Now

ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ అవినీతి: ప్రధాని మోడీ

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: తెలంగాణను దోచుకున్న వారిని తాము విడిచిపెట్టేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జగిత్యాల విజయ సంకల్ప సభలో మాట్లాడుతూ.. ‘కుటుంబ పార్టీలు దేశాన్ని దోచుకునేందుకే రాజకీయాలు చేస్తాయి. దేశంలో ఏ దోపిడీని పరిశీలించినా.. దాని వెనుక కుటుంబ పార్టీలే ఉన్నాయి. 2జీ స్పెక్ట్రమ్‌ కేసులో డీఎంకే, నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌.. ఇప్పుడు ఆ జాబితాలో బీఆర్ఎస్ చేరింది. కాళేశ్వరంలో, ఢిల్లీ మద్యం అంశంలోనూ అవినీతికి పాల్పడింది’ అని మోడీ అన్నారు.

Spread the love