ప్రతిపక్షం, స్పోర్ట్స్: ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో ద్విశతకాలతో చెలరేగిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. టెస్ట్ ర్యాంకింగ్స్లోనూ సత్తా చాటాడు. ఐసిసి తాజా టెస్ట్ బ్యాటర్స్ ర్యాంకింగ్స్లో జైస్వాల్ కెరీర్ బెస్ట్ ర్యాంకుకు చేరుకున్నాడు. వైజాగ్, రాజ్కోట్ టెస్టుల్లో డబుల్ సెంచరీలతో మెరిసిన జైస్వాల్.. టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్లో 14వ స్థానాలు మెరుగుపరుచుకొని 15వ ర్యాంకుకు చేరుకున్నాడు. రాజ్కోట్ టెస్టుకు ముందు 29వ ర్యాంకులో ఉన్నాడు. జైస్వాల్ 699 పాయింట్లతో ఈ ర్యాంకుకు చేరాడు. కాగా ఐసీసీ టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్లో భారత్ నుంచి విరాట్ కోహ్లీ ఒక్కడే టాప్-10లో ఉన్నాడు.