Trending Now

వారి మాయ మాటలు నమ్మి మోసపోకండి : బండి సంజయ్

ప్రతిపక్షం, కరీంనగర్: కాంగ్రెస్ గెలిపిస్తే ఏ దేశం నుండి నిధులు తీసుకొస్తారు..? బీజేపీ ఎంపీలను గెలిపిస్తే కేంద్రాన్ని ఒప్పించి అధిక నిధులు తీసుకొస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మాయమాటలు నమ్మి మోసపోకండని ప్రజలను కోరారు. ప్రజాహిత యాత్రలో భాగంగా చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు మండలం శ్రీరాములపల్లెలో ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. చొప్పదండి ఉపాధి హామీ పనుల కోసం 167కోట్ల 47 లక్షలు.. రోడ్ల మెటీరియల్ కోసం 72 కొట్ల్ 91 లక్షలు ..చెట్ల పెంపకం కోసం 88 కోట్ల 52 లక్షలు కేంద్రం ఇచ్చింది. రేషన్, వ్యాక్సిన్ ఎవరు ఇచ్చారు అంటే మోదీ అంటారు..? మీరు ఓటు మాత్రం కాంగ్రెస్ కి వేశారు ఎందుకు అక్క..? అన్ని పనుల కోసం మోదీ నిధులు ఇచ్చారు అంటారు. ఓటు మాత్రం కాంగ్రెస్ కి వేశారు. ఈ సారి అలా చేయకండి దయచేసి అని ప్రజలన బండి సంజయ్ కోరారు.100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పటివరకు హామీలు పూర్తి కాలేదు. నరేంద్ర మోడీ ప్రధాని కాకుంటే రేషన్, సబ్సిడీలు ఆగిపోతాయి. దయచేసి ఆలోచించండి ఎన్నికలు వస్తున్నాయి.. మీరు నాకు ఓటేసి గెలిపిస్తే నేను వెళ్లి మోదీ కి ఓటేస్తా.. ప్రధాని అభ్యర్థి లేని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన ప్రయోజనం లేదని బండి సంజయ్ అన్నారు.

Spread the love