విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర?.. రూ.180 కోట్ల వ్యవహారంపై సంచలనం

ప్రతిపక్షం, జూలై 04: తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్రకు సంబంధించి సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వంలోని 10 మందికిపైగా ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ఓ కార్పొరేట్ సంస్థ సుమారు రూ.180 కోట్ల నిధులను కేటాయించినట్లు సమాచారం.

దర్యాప్తులో భాగంగా నిందితులు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో, డబ్బు లేదా బెదిరింపులకు ఎవరూ లొంగలేదని పేర్కొన్నట్లు తెలుస్తోంది. అలాగే డీఎంకే ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ, ఆయన సోదరుడి నేతృత్వంలో రూ.35 కోట్ల ఒప్పందం కుదిరినట్లు వారు వెల్లడించినట్లు సమాచారం.

అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసుల విచారణ పూర్తయ్యే వరకు ఈ ఆరోపణలపై తుది నిర్ధారణ రావాల్సి ఉంది.

Spread the love

Related News

Latest News