Trending Now

రూ. 500 గ్యాస్ సిలిండర్ స్కీమ్‌ కు గైడ్​లైన్స్..

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: మహాలక్ష్మి పథకంలో భాగంగా మరో స్కీమ్ అమలుకుప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రూ. 500 గ్యాస్ సిలిండర్ స్కీమ్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం వేదికగా ప్రారంభించారు. ఈ క్రమంలో రూ. 500 గ్యాస్ పథకానికి సంబంధించి గైడ్‌లైన్స్ విడుదల చేశారు. ఈ నిబంధనల ప్రకారం.. పథకం అమలు ఎలా చేస్తారు..? ఎవరు ఈ పథకానికి అర్హులు..? వంటి కీలక వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

  1. మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే స్కీమ్‌కి సంబంధించిన జీవోను ప్రభుత్వం జారీ చేసింది.
  2. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కోసం మూడు అంశాలను పరిగణలోకి తీసుకుంది.
  3. సబ్సిడీ సిలిండర్ కోసం ప్రజాపాలనలో అప్లై చేసిన వారి లిస్ట్ ఆధారంగా 39.5 లక్షల లబ్ధిదారులను గుర్తించారు.
  4. ఈ పథకానికి అర్హులుగా తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం.
  5. మూడు సంవత్సరాల వినియోగాన్ని పరిగణలోకి తీసుకొని.. దాని యావరేజ్ ఆధారంగా సంవత్సరానికి సిలిండర్స్ కేటాయిస్తారు.
  6. వినియోగదారులు తొలుత మొత్తం డబ్బు చెల్లించి సిలిండర్ తీసుకోవాలి.
  7. ఆ తరువాత వినియోగదారుల ఖాతాలోకి తిరిగి సబ్సిడీ మొత్తాన్ని జమ చేస్తారు.
  8. గ్యాస్ సబ్సిడీని ప్రభుత్వం నేరుగా గ్యాస్​ సంస్థలకు ఇవ్వనుంది. సంస్థల నుంచి వినియోగదారులకు నగదు చెల్లింపు చేస్తారు.
  9. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని మానిటరింగ్ చేయనుంది ప్రభుత్వం.
  10. భవిష్యత్తులో వినియోగదారుల నుంచి కేవలం రూ. 500 చెల్లించేలా ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం.
  11. 48 గంటల్లోనే వినియోగదారుల బ్యాంక్​ ఖాతాల్లోని సబ్సిడీ డబ్బులు బదిలీ అయ్యేలా ఏర్పాట్లు చేశారు.
Spread the love