Trending Now

పేటీఎం క్యూఆర్ కోడ్‌పై కంపెనీ సీఈఓ సంచలన ట్వీట్..

ప్రతిపక్షం, నేషనల్: ఆర్‌బీఐ ఆంక్షల కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు కొత్త సమస్య ఎదురైంది. గత నెలాఖరున పేటీఎంపై ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కంపెనీ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఎక్స్‌లో స్పందించారు. ‘దేశీయంగా పేటీఎం క్యూఆర్ కోడ్‌తో పాటు సౌండ్ బాక్స్ పనిచేస్తూనే ఉంటాయి. దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ ఔట్‌లెట్‌లలో డిజిటల్ చెల్లింపుల కోసం ఉపయోగించే అత్యంత ప్రజాదరణ పొందిన స్కాన్ -అండ్-పే ఎప్పటి లాగే పనిచేస్తూనే ఉంటుంది. ఈరోజు, రేపు, ఎప్పటికీ పేటీఎం చేయండి.. ‘ అని విజయ్ ట్వీట్ చేశారు.

ఫిబ్రవరి 29 తర్వాత కస్టమర్ అకౌంట్లు, వ్యాలెట్, ఫాస్టాగ్ డిపాజిట్లు ఏవీ తీసుకోకూడదని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా దీన్ని మార్చి 15 వరకు పొడిగించారు. ఈ క్రమంలోనే పేటీఎం అన్ని రకాల సేవలు నిలిపోతాయని సోషల్ మీడియాలో కొన్ని నకిలీ కథనాలు సర్క్యులేట్ అయ్యాయి. దీనికి సంబంధించి ఆర్‌బీఐ సైతం స్పష్టత ఇచ్చింది. ఇప్పుడు సంస్థ అధినేత కూడా సందేహపడొద్దని, క్యూఆర్ కోడ్, సౌండ్ బాక్స్‌లు పనిచేస్తాయని పేర్కొన్నారు.

Spread the love