నిర్మల్, (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి) ఏప్రిల్, 17 : శ్రీరామ నవమి పురస్కరించుకొని నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం పరిధిలోని జన్నారం లో గల రామాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ భూక్య జాన్సన్ నాయక్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. జన్నారం తో పాటు మండలంలోని మురి మడుగు తపాలాపూర్ తిమ్మాపూర్ దేవాలయాలలో కూడా ఆయన పాల్గొని పూజలు చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ ఆయా విభాగాల పదాధికారులు, నాయకులు, స్థానికులు ఉన్నారు.