Trending Now

శ్రీరామ కళ్యాణోత్సవంలో పాల్గొన్న నిర్మల్ ఎమ్మెల్యే సతీమణి..

నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి) ఏప్రిల్ 17 : నిర్మల్ జిల్లాలోని సోన్ మండల పరిధిలో గల కడ్తాల్, లెఫ్ట్ పోచంపాడు గ్రామాలలో ఉన్న శ్రీరాముని ఆలయాల్లో నిర్వహించిన శ్రీరామనవమిని పురస్కరించుకొని నిర్మల్ శాసనసభ్యులు, బీజేఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సతీమణి కవిత రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య హారతులను స్వీకరించారు. మహిళలతో కలిసి సాంప్రదాయ పద్ధతులలో స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. ఆమె వెంట సోన్ ఎంపీపీ సమత హరిశ్వర్ రెడ్డి, మారా గంగారెడ్డి గంగన్న, ఉదయ్ కుమార్, అజయ్, రవి తదితరులు ఉన్నారు.

Spread the love

Related News