Trending Now

అన్నా నువ్వే గెలుస్తున్నావ్.. ఈటలతో మాజీ మంత్రి మల్లారెడ్డి

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి మరో బాంబు పేల్చారు. మల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుస్తాడని సంచలన ప్రకటన చేశారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో జరిగిన ఓ ఫంక్షన్ లో ఈటల రాజెందర్, మల్లారెడ్డి కలుసుకున్నారు. ఈ నేపథ్యంలో అడిగి మరీ ఈటలతో ఫోటో దిగారు. తప్పక విజయం సాధిస్తారని దీవించారు. మల్కాజిగిరిలో ఇంకెవరు గెలుస్తారు.. నువ్వే గెలుస్తున్నవ్ అంటూ ఈటలను గట్టిగా హత్తుకున్నారు. ఈ పరిణామం బీఆర్ఎస్ వర్గాలను షాక్‌కు గురిచేసింది. మల్కాజిగిరి లోకసభ నియోజకవర్గంలోనే మల్లారెడ్డి, ఆయన అల్లుడు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మల్కాజిగిరిలో మొతం ఏడు సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంది. అలాంటి చోట బీజేపీ అభ్యర్థి గెలుస్తారని బహిరంగంగా ప్రకటించడం చర్చనీయాంశమైంది.

Spread the love

Related News