Trending Now

‘ఎండుతున్న పంటలకి వెంటనే సాగునీరు అందించాలి’

ప్రతిపక్షం, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం శివారులో నిర్మించిన గౌరవెల్లి రిజర్వాయర్ ద్వారా చుట్టుప్రక్కల ఆధారపడిన పంటలకు వెంటనే సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని ధర్మ సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు రవిబాబు డిమాండ్ చేశారు. అక్కన్నపేట మండల నాయకులతో కలసి ఆయన ఈరోజు గౌరవెల్లి ప్రాజెక్టుని సందర్శించి పరిసర ప్రాంతంలో పంటలను పరిశీలించడం జరిగింది. అందుకు వేసవికాలం ప్రారంభమై నీటి ఎద్దడి ఉన్న కారణంగా ప్రాజెక్టు పైన ఆశపెట్టుకొని రైతులు సాగుచేసిన పంటలకు నీరు అందక ఎండిపోతున్నాయని కనీసం పెట్టుబడి వరకైనా పంట చేతికి వచ్చేది కనబడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల రైతులు అప్పుల పాలు కావాల్సి వస్తుందని అందుకు వెంటనే ప్రభుత్వం స్పందించి గౌరవెల్లి రిజర్వాయర్ లోకి నీటి పంపిణీ చేసి అక్కడి నుండి కాలువల ద్వారా పంటలకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, అక్కన్నపేట మండల అధ్యక్షులు సతీష్ , సురేషు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Spread the love