Trending Now

ప్రియాంక గాంధీ సభను విజయవంతం చేయండి

ప్రతిపక్షం, జుక్కల్ నియోజకవర్గం ఆర్‌సీ ఇంచార్జ్, మే 8 : కామారెడ్డి లో ఈ నెల 11న కాంగ్రెస్ కీలకనేత ప్రియాంక గాంధీ సభను కాంగ్రెస్ శ్రేణులు విజయవంతం చేయాలని జుక్కల్ నియోజకవర్గం పిట్లం మండలం అల్లాపూర్ గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోలన్ నాగేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కామారెడ్డి సభ విజయవంతం చేయాలి అన్నారు. అలాగే మొట్ట మొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లా కు రావడం సంతోషకరమని ఆయన అన్నారు. అల్లాపూర్ గ్రామంలోని బుధవారం నాడు నిర్వహించిన యువజన కాంగ్రెస్ సమావేశంలో ఆయన మాట్లాడారు. జహీరాబాద్ లోక్ సభ ఎన్నికల్లో సురేశ్ షెట్కార్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం లో అల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాపిరెడ్డి, మోహన్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు మల్లేశం, మాజీ ఎంపీటీసీ లింగం, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News