Trending Now

లోక్‌సభ ఎన్నికల వేళ ఆసక్తికర ఘటన.. జితేందర్‌ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్‌

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: లోక్‌సభ ఎన్నికల వేళ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి.. బీజేపీ సీనియర్‌ నేత జితేందర్‌ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా జితేందర్‌ రెడ్డిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించినట్టు సమాచారం. అయితే, రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జితేందర్‌ రెడ్డి మహబూబ్‌నగర్‌ ఎంపీ స్థానం నుంచి ఆశించారు. మొదటి నుంచి ఇక్కడ పోటీ చేయాలని జితేందర్‌ రెడ్డి ప్లాన్‌ చేసుకున్నారు.

కానీ, బీజేపీ హైకమాండ్‌ మాత్రం జితేందర్‌ రెడ్డిని కాదని డీకే అరుణకు అవకాశం కల్పించింది. దీంతో టికెట్‌ ఆశించిన జితేందర్‌ రెడ్డి భంగపాటుకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్‌ ఆయన ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌లోకి జితేందర్‌ రెడ్డిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి ఉన్నారు.

Spread the love