హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యాసంస్థల సోసైటీ కార్యదర్శిగా బి. సైదులు బాధ్యతలు తీసుకున్నారు. బుధవారం మాసాబ్ ట్యాంక్ లోని సోసైటీ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు తీసుకుని సిబ్బందితో సమావేశం నిర్వహించారు. గురుకుల విద్యాసంస్థల పనితీరు గురించి మాజీ కార్యదర్శి మల్లయ్య భట్టు వివరించారు. నాగార్జునసాగర్ లోని బిసీ గురుకుల విద్యాలయంలో చదువుకుని ఐఎఫ్ఎస్ కు బి. సైదులు ఎంపికయ్యారు. గతంలో అటవీశాఖలో, గ్రామీణాభివృద్ధి తదితర శాఖల్లో పనిచేశారు.
ఎంజెపి సోసైటీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సైదులు ని మాజీ ఐఎఎస్ అధికారి ఆకునూరి మురళి మర్యాదపూర్వకంగా కలిశారు.