Trending Now

చంద్రబాబు కీలక నిర్ణయం.. మాజీ మంత్రికి కీలక బాధ్యతలు..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమాకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమన్వయ బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీచేశారు. ఇప్పటికే ఉన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాతో పాటు అదనపు బాధ్యతలను చంద్రబాబు ఆయనకు అప్పగించారు. ఈ సారి ఎన్నికల్లో సీట్ల సద్దుబాటు కారణంగా పోటీ చేయలేకపోతున్న ఉమాకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తూ చంద్రబాబు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.

Spread the love