Trending Now

రతన్ టాటాకు పీవీ నరసింహారావు స్మారక అవార్డు

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: టాటా సన్స్ మాజీ ఛైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా ప్రతిష్ఠాత్మక పీవీ నరసింహారావు స్మారక అవార్డు అందుకున్నారు. దాతృత్వ రంగంలో ఆయన చేసిన విశేషమైన కృషికి గారూ ఈ అవార్డు దక్కింది. ముంబైలో జరిగిన వేడుకలో ప్రతినిధులు ఆయనకు అవార్డును అందించారు. రతన్ టాటా తన ఆదాయంలో సగానికిపైగా దాతృత్వానికి విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే టాటా ట్రస్ట్‌ల ద్వారా కూడా విరాళాలు ఇస్తూ దాతృత్వం చాటుకుంటున్నారు.

Spread the love