ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ జూలై 18: తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గ మాత ఆలయంలో ఈరోజు టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఏడుపాయలకు విచ్చేశారు. హీరోను మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్ ను ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం నుండి హీరో మంచి విష్ణుకు ఘనంగా సన్మానించారు. అనంతరం ఏడుపాయల వన దుర్గ మాత చరిత్రను విశిష్టతను జిల్లా అదుపు కలెక్టర్ నాగేష్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఈవో వివో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

























