Trending Now

టీడీపీలో చేరిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో కర్నూల్ ఎంపీ సంజీవ్ కుమార్ చేరారు. పార్టీ కండువా కప్పి సంజీవ్ కుమార్ ను సాదరంగా చంద్రబాబు ఆహ్వానించారు. ఈ సందర్భంగా సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. పొయ్యిమీద కాలుతున్న కుండను ముట్టుకునే ప్రయత్నం చేస్తే చెయ్యి కాలుతుందన్నారు. నాతో సహా రాష్ట్ర ప్రజలు వైసీపీను ఓసారి ముట్టుకుని ఆ తప్పు చేశారని ఆయన విమర్శించారు. రెండో చెయ్యి కూడా కాల్చుకోవద్దని ప్రజల్ని కోరుతున్నానన్నారు సంజీవ్‌ కుమార్‌. కర్నూల్ అభివృద్ధి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే టీడీపీలో చేరా అని ఆయన వెల్లడించారు. ఎలాంటి సీటు ఆశించకుండా భేషరతుగానే టీడీపీలో చేరానని ఆయన పేర్కొన్నారు.

Spread the love