Trending Now

ప్రజా నాయకుడు ఐలేని మోహన్ రెడ్డి 27వ వర్ధంతి..

హుస్నాబాద్. ప్రతిపక్షం మార్చి 27: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రాంతానికి చెందిన ప్రజా నాయకుడు ఐలేని మోహన్ రెడ్డి 27వ వర్థంతి కార్యక్రమం హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో తనయుడు అయిన నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు ఐలేని మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లిఖార్జున్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల హృదయాలల్లో నిలిచిన నాయకుడు ఐలేని మోహన్ రెడ్డి అని ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసిన నాయకుడన్నారు. 1996 సంవత్సర కాలంలో నక్సలైట్ల చేతిలో హత్య గురైనారని తెలిపారు. హుస్నాబాద్ ప్రాంత అప్పటి పీపుల్స్ వార్ దళం కేవలం కొంత మంది చెప్పుడు మాటలు విని.. మా నాన్నను అన్యాయంగా హత్య చేసినారని.. మా కుటుంబం రోడ్డున పడ్డామని అన్నారు. ఇప్పటికి ఆయనను ప్రజలు మర్చిపోలేదన్నారు. వారి ఆశయాలను తప్పకుండా ముందుకు తీసుకువెళ్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కేడం లింగామూర్తి మాట్లాడుతూ.. ప్రజల కోసం పని చేసిన వారిని ప్రజలు ఎప్పుడు మర్చిపోరని అన్నారు. ఈ కార్యక్రమంలో బి అర్ యస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎండీ.అన్వర్ పాషా, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Latest News