[t4b-ticker]

సంచలనం.. 22 మందికి ఉరిశిక్ష

ప్రతిపక్షం, ఆగస్టు 17: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి రవికుమార్‌ వరుస సంచలన తీర్పులతో వార్తల్లో నిలిచారు. హత్య, కిడ్నాప్‌, దోపిడీ వంటి తీవ్రమైన నేరాలకు సంబంధించిన 10 వేర్వేరు కేసుల్లో దోషులుగా తేలిన 22 మందికి మరణశిక్ష విధించారు. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఈ తీర్పులు వెలువడటం చర్చనీయాంశంగా మారింది.

తీవ్రమైన నేరాలకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో కేసుల వారీగా విచారణ జరిపిన అనంతరం న్యాయమూర్తి రవికుమార్‌ దోషులకు కఠిన శిక్షలు విధించారు. హత్య, అపహరణ, దోపిడీ వంటి నేరాల్లో నిందితులపై అభియోగాలు రుజువు కావడంతో ఈ తీర్పులు వెలువడ్డాయి.

కాగా, న్యాయమూర్తి రవికుమార్‌ గతంలో వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదుకు సంబంధించిన కేసులో వీడియో సర్వే నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేయడం ద్వారా కూడా వార్తల్లో నిలిచారు. దీంతో ఆయన తాజా తీర్పులు మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.

అయితే సెషన్స్‌ కోర్టు విధించిన మరణశిక్షతో కేసులు పూర్తిగా ముగిసినట్లు కాదు. చట్ట ప్రకారం మరణశిక్ష అమలుకు సంబంధిత హైకోర్టు ధ్రువీకరణ తప్పనిసరి. దోషులు హైకోర్టును ఆశ్రయించే అవకాశం కూడా ఉంటుంది. హైకోర్టు పరిశీలన, తదుపరి న్యాయ ప్రక్రియ పూర్తయిన తర్వాతే మరణశిక్ష అమలుపై తుది నిర్ణయం ఉంటుంది.

ఒకేసారి ఇన్ని కేసుల్లో మరణశిక్షలు విధించడం, అందులోనూ నాలుగు నెలల వ్యవధిలో 22 మందికి ఈ శిక్ష పడటం ముజఫర్‌నగర్‌ న్యాయస్థానంలోనే కాకుండా ఉత్తరప్రదేశ్‌లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Spread the love

Related News

Latest News