[t4b-ticker]

రాఖీ పండుగ ఆగస్టు 27నా.. 28నా? శుభ ముహూర్తం ఎప్పుడంటే?

ప్రతిపక్షం, ఆగస్టు 22: రాఖీ పండుగను ప్రతి ఏడాది శ్రావణ శుక్ల పక్ష పౌర్ణమి తిథి రోజున జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది పౌర్ణమి తిథి రెండు రోజుల్లో ఉండటంతో రాఖీ పండుగను ఆగస్టు 27న జరుపుకోవాలా? లేక 28న జరుపుకోవాలా? అనే సందేహం చాలామందిలో నెలకొంది. దీనిపై పండితులు స్పష్టత ఇచ్చారు.

పౌర్ణమి తిథి ఆగస్టు 27 ఉదయం 9.08 గంటలకు ప్రారంభమై.. ఆగస్టు 28 ఉదయం 9.48 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. శాస్త్రాల ప్రకారం పండుగను నిర్ణయించేటప్పుడు ఉదయ తిథికి ప్రాధాన్యం ఇస్తారని, ఈ లెక్కన ఆగస్టు 28న రాఖీ పండుగను జరుపుకోవడం శ్రేయస్కరమని పండితులు సూచిస్తున్నారు.

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా రాఖీ పండుగను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టి వారి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలను కోరుకుంటారు. సోదరులు కూడా వారికి కానుకలు అందించి రక్షణగా ఉంటామని హామీ ఇస్తారు.

ఆగస్టు 28న రాఖీ కట్టేందుకు రెండు శుభ సమయాలు ఉన్నాయని పండితులు తెలిపారు. ఉదయం 6.23 గంటల నుంచి 9.48 గంటల వరకు, మధ్యాహ్నం 12.14 గంటల నుంచి 1.05 గంటల వరకు రాఖీ కట్టేందుకు అనుకూలమైన సమయాలుగా పేర్కొన్నారు.

అందువల్ల పౌర్ణమి తిథి రెండు రోజులకు విస్తరించినప్పటికీ.. ఉదయ తిథి ఆధారంగా ఆగస్టు 28న రాఖీ పండుగను జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. కుటుంబ సభ్యులు శుభ ముహూర్తాల్లో రాఖీ వేడుకలు నిర్వహించుకోవచ్చని తెలిపారు.

Spread the love

Related News

Latest News