Trending Now

BREAKING.. మక్తల్ లో ఘోర రోడ్డు ప్రమాదం


లారీని ఢీకొన్న వోల్వో బస్సు
18 మందికి తీవ్ర గాయాలు, పలువురి పరిస్థితి విషమం


ప్రతిపక్షం ప్రతినిధి, నారాయణపేట్:

నారాయణపేట్​ జిల్లా మక్తల్​లో గురువారం తెల్లవారు ఝామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 30 మంది ప్రయాణికులతో ఉన్న వోల్వో బస్సు లారీని ఢీకొనడంతో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి… పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జక్లేర్ పరిసర ప్రాంతాల్లో జరిగింది. శివమొగ్గ నుంచి దాదాపు 30 మంది హైదరాబాద్ కి వెళ్తున్న శ్రీ దుర్గాంబా ట్రావెల్స్ బస్సు వర్షం పడుతుండటంతో ప్రమాదవశాత్తు లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసం కావడం తో దాదాపు 18 మందికి ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా డ్రైవర్ రెండు కాళ్ళు విరిగి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. పలువురి ప్రయాణికుల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న మక్తల్ పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఈ బస్సులో దాదాపు 30 మంది పైనే ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

Spread the love

Related News