ఉద్దేశపూర్వకంగానే రాజముద్ర మార్పు: కేటీఆర్

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: రాజకీయ కుట్రతో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రాజముద్రను మార్పు చేయాలని నిర్ణయించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ అధికారిక ముద్ర మార్పును నిరసిస్తూ.. చార్మినార్ వద్ద ధర్నాకు దిగారు. గత పదేళ్లలో చేసిన ప్రగతిని కనిపించకుండా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష చేస్తోందని దుయ్యబట్టారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోకుండా ఇలాంటి చర్యలకు దిగడం తగదని అన్నారు.

Spread the love

Related News