Trending Now

హుస్నాబాద్​లో ‘రైతు మహోత్సవం’ ప్రారంభం

ఘనంగా ప్రారంభించినన మంత్రులు


ప్రతిపక్షం, హుస్నాబాద్​:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో రైతు మహోత్సవం కార్యక్రమాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వర్​రావు, పొన్నం ప్రభాకర్​ ఘనంగా ప్రారంభించారు. మంత్రులను ఎడ్ల బండిపై ఊరేగింపుగా కార్యక్రమం వద్దకు తీసుకెళ్లారు. అనంతరం హుస్నాబాద్ మార్కెట్ కమిటీ లో ఏర్పాటు చేసిన రైతు మహోత్సవం కార్యక్రమం వద్ద ఏర్పాటు చేసిన 150 కి పైగా స్టాల్ లను మంత్రులు పరిశీలించారు. స్టాల్ లలో ఆయిల్ ఫామ్, ప్రకృతి సిద్ధంగా పండించిన కూరగాయలు, ఉద్యానవన,పట్టు పరిశ్రమకు సంబంధించిన వాటిని పరిశీలించారు.. భారీగా దిగుబడి వచ్చిన పామాయిల్ పంట పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పట్టుగుళ్ళ దండలను పరిశీలించారు.
నూనె గింజల ఉత్పత్తి స్టాల్ లను పరిశీలించారు. ఆధునిక సాంకేతికత తో కూడిన వ్యవసాయంలో అధునాతన యంత్రాలను పరిశీలించారు.. డ్రిప్ ఇరిగేషన్ ,కొత్తగా వచ్చిన స్పింక్లర్లను పరిశీలించారు.. పండ్ల రకాల నూతన వంగడాలను పరిశీలించారు. వివిధ రకాల పంటల విత్తనాలను పరిశీలించారు..చీడ పీడల నుండి పంటలను రక్షించడానికి ఉపయోగించే క్రిమి సంహారక మందుల గురించి ఆరా తీశారు.. నీలి విప్లవం ద్వారా చేప పిల్లల ఉత్పత్తి ,శనిగరం ప్రాజెక్ట్ లో విడుదల చేసిన చేపలను ఎక్స్పరిమెంట్ ద్వారా వివరించిన అధికారులు పాడి పరిశ్రమ పాల ఉత్పత్తి స్టాల్ లు ,మేకలు ,గొర్రెలు ,ఆవులు ,గేదెలు ,కృత్తిమ గర్భధారణ తదితర వాటినీ పరిశీలించారు..

Spread the love

Related News