ఐదుగురు గల్లంతు నలుగురు మృతదేహాలు గుర్తింపు
ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి, నిర్మల్, జూన్ 15 :
నిర్మల్ జిల్లా బాసరలో విషాదం చోటుచేసుకుంది. పవిత్ర గోదావరి ఒడిలో పుణ్యా స్నానానికి అని దిగిన ఐదుగురు భక్తులు గల్లంతయ్యారు. నలుగురిని గజా ఈతగాళ్లు వెలికి తీశారు. మరొకరి మృతదేహం కోసం అన్వేషిస్తున్నారు. మృతులంతా హైదరాబాద్ నగరానికి చెందినవారుగా గుర్తించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని శవపంచనామాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం బాసర జ్ఞాన సరస్వతి దేవిని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా ఈ భక్తులు వచ్చినట్లు చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.