Trending Now

3కార్పొరేషన్లుగా హైదరాబాద్​.. గెజిట్​ విడుదల

ప్రతిపక్షం, హైదరాబాద్​, ఫిబ్రవరి 11:
గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ ను మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది. జీహెచ్​ఎంసీ తో పాటు మల్కాజిగిరి మున్సిపల్​ కార్పొరేషన్​ (ఎంఎంసీ), సైబరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ (సీఎంసీ)లను ఏర్పాటు చేస్తూ గెజిట్​ విడుదల చేసింది. అలాగే ఈ మూడు కార్పొరేషన్లకు కమిషనర్లను కూడా నియమించింది. జీహెచ్​ఎంసీ కమిషనర్​ గా ఆర్ వీ కర్ణన్​ ను యథాతథంగా కొనసాగించిన ప్రభుత్వం సైబరాబాద్​ కు శ్రీజన, మల్కాజిగిరికి వినయ్​ కృష్ణారెడ్డిని కమిషనర్లుగా నియమించింది. జీహెచ్​ ఎంసీ లోని 150 డివిజన్లు డి లిమిటేషన్​ లో భాగంగా 243 డివిజన్లుగా ఏర్పడ్డాయి. వీటితో పాటు విలీనమైన మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు 57 డివిజన్లుగా ఏర్పాటయ్యాయి. పరిపాలన సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ లక్ష్యంగా జీహెచ్​ ఎంసీని మూడు కార్పొరేషన్లుగా ప్రభుత్వం విస్తరించింది. 300 డివిజన్లతో జీహెచ్​ ఎంసీ బృహత్​ నగరపాలక సంస్థగా ఏర్పడింది.

Spread the love

Related News