Trending Now

రాయ్ బరేలీ బయలుదేరిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్ బరేలీ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారం చేసేందుకు ఈ రోజు ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వెళ్లారు. బయలుదేరిన వారిలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి రవి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, నాగర్ కర్నూల్ ఎమ్మెల్య రాజేష్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్య మెగా రెడ్డి, గద్వాల జెడ్పీ చైర్మన్ సరిత, నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇన్ చార్జి మధుసూదన్ రెడ్డి, నాగర్ కర్నూలు జిల్లా ఓబీసీ సెల్ ప్రెసిడెంట్ గిరి వర్ధన్ గౌడ్, గద్వాల సీనియర్ నాయకుడు తిరుపతయ్య తదితరులు ఉన్నారు.

Spread the love

Related News