BR Naidu: టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు

TTD BOARD Chairman BR Naidu: తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా బీఆర్ నాయుడును ప్రభుత్వం ప్రకటించింది. 24 మంది సభ్యులతో పాలక మండలిని నియమించింది. ఈ మేరకు టీటీడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా, బీఆర్ నాయుడు ఓ మీడియా ఛానల్ అధినేత కావడం గమనార్హం. జ్యోతుల నెహ్రూ-జగ్గంపేట ఎమ్మెల్యే, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి-కోవూరు ఎమ్మెల్యే, ఎం.ఎస్‌ రాజు-మడకశిర ఎమ్మెల్యే, పనబాక లక్ష్మి-కేంద్ర మాజీ మంత్రి, జాస్తి పూర్ణ సాంబశివరావు, నన్నూరి నర్సిరెడ్డి (తెలంగాణ), శ్రీసదాశివరావు నన్నపనేని, కృష్ణమూర్తి ( తమిళనాడు), కోటేశ్వరరావు, మల్లెల రాజశేఖర్‌ గౌడ్‌, జంగా కృష్ణమూర్తి, దర్శన్‌. ఆర్‌.ఎన్‌ (కర్ణాటక), జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్‌ (కర్ణాటక), శాంతారామ్‌, పి.రామ్మూర్తి (తమిళనాడు), జానకీ దేవి తమ్మిశెట్టి, బూంగునూరు మహేందర్‌ రెడ్డి (తెలంగాణ), అనుగోలు రంగశ్రీ (తెలంగాణ), బూరగాపు ఆనందసాయి (తెలంగాణ), సుచిత్ర ఎల్ల (తెలంగాణ), నరేశ్‌కుమార్‌ ( కర్ణాటక), డా.అదిత్‌ దేశాయ్‌ (గుజరాత్‌), శ్రీసౌరబ్‌ హెచ్‌ బోరా (మహారాష్ట్ర)లను మెంబర్లుగా ప్రకటించింది.

Spread the love

Related News