ప్రతిపక్షం, జూన్ 16: తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సమావేశమై పెండింగ్ బిల్లుల అంశంపై చర్చించారు. బిల్డర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ నెల 18న నిర్వహించ తలపెట్టిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని విరమించాలని కోరినట్లు తెలిపారు.
గత ప్రభుత్వం ఆర్అండ్బీ శాఖలో సుమారు రూ.4 వేల కోట్ల బకాయిలు ఉంచిందని, యాదాద్రి ఆలయ నిర్మాణానికి సంబంధించిన రూ.350 కోట్ల బిల్లులు కూడా చెల్లించలేదని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రితో చర్చించి బకాయిల చెల్లింపుపై హామీ ఇచ్చామని, దీనిపై బిల్డర్స్ అసోసియేషన్ సాయంత్రం వరకు నిర్ణయం వెల్లడిస్తుందని చెప్పారు.
అలాగే మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంట్రాక్టుల కేటాయింపులపై పూర్తి వివరాలు బయటపెడితే వాస్తవాలు తెలుస్తాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యానించారు.

















