5 ఎకరాలకుపైగా ఉన్న రైతులకూ ‘రైతు భరోసా’.. క్యాబినెట్‌లో కీలక నిర్ణయం?

ప్రతిపక్షం, జూన్ 16: తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకంపై మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రెండు విడతలుగా నిధులు విడుదల చేసిన ప్రభుత్వం, మూడో విడత రైతు భరోసాతో పాటు 5 ఎకరాలకుపైగా భూమి కలిగిన రైతులకు కూడా పథకం వర్తింపజేయడంపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

ఈ నెల 18న జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. రైతు భరోసాతో పాటు సన్న వరిధాన్యానికి బోనస్ చెల్లింపు, ఉపసర్పంచుల చెక్‌పవర్ రద్దు, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు, హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నిర్వహణ వంటి కీలక అంశాలు కూడా కేబినెట్ అజెండాలో ఉన్నట్లు సమాచారం.

రైతు భరోసా విస్తరణపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Spread the love

Related News

Latest News