‘వేధించిన వారిని వదిలేది లేదు’.. కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ హెచ్చరిక

ప్రతిపక్షం, జూన్ 23: తెలంగాణలో తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసిన వారిపై భవిష్యత్తులో చర్యలు తప్పవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు హెచ్చరించారు. వర్ధన్నపేటలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచిన వారిని ఎప్పటికీ మర్చిపోమని అన్నారు.

తమ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేసిన వారందరి వ్యవహారాలను గుర్తుంచుకుంటామని పేర్కొన్నారు. గతంలో జరిగిన పరిణామాలను పార్టీ శ్రేణులు మరిచిపోవద్దని సూచిస్తూ, రాజకీయంగా తగిన సమయంలో సమాధానం ఇస్తామని వ్యాఖ్యానించారు.

అలాగే ప్రస్తుత ప్రభుత్వ వైఖరిపై పరోక్ష విమర్శలు చేసిన కేటీఆర్, అధికారాన్ని ఉపయోగించి ప్రతిపక్ష కార్యకర్తలను లక్ష్యంగా చేసుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. తమపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేసిన వారిని, అన్యాయంగా కేసులు పెట్టిన వారిని భవిష్యత్తులో ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు.

పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, బీఆర్ఎస్ మళ్లీ ప్రజల మధ్య బలంగా నిలబడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Spread the love

Related News

Latest News