ప్రతిపక్షం, జూన్ 26: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సీఎస్గా ఉన్న కె. రామకృష్ణారావు ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో సంజయ్ జాజును నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇటీవల కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి వచ్చిన సంజయ్ జాజుకు రాష్ట్ర పరిపాలనలో అత్యున్నత బాధ్యతలు అప్పగించింది. ఆయన త్వరలోనే తెలంగాణ కొత్త ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
రాష్ట్ర పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రధాన కార్యదర్శి కీలక పాత్ర పోషిస్తారు. ఈ నేపథ్యంలో సంజయ్ జాజు నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది.
















