Trending Now

కాంగ్రెస్ కు రైతుల ఉసురు తగులుతుంది : ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ ను, కేసీఆర్ ను అప్రతిష్ఠపాలు చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నీళ్లు ఇవ్వడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో ఎండిపోయిన వరి, మిరప తోటలను రైతులతో కలిసి పరిశీలించారు. కేసీఆర్ పాలనలో 10 సంవత్సరాల్లో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చామని, కాంగ్రెస్ వచ్చిన కొద్ది నెలల్లోనే రైతులు పంటలు తగలపెట్టుకునే దీన స్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. ఎండిపోయిన వరి రైతులకు ఎకరాకు రూ.50 వేలు, మిరప రైతులకు రూ.80 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసారు.

Spread the love

Related News