ప్రతిపక్షం, జూలై 05: స్నాప్చాట్లో పరిచయమైన యువతిని కలుసుకోవాలనే ఉద్దేశంతో పాక్ ఆక్రమిత కశ్మీర్కు చెందిన జీషన్ అహ్మద్ అక్రమంగా భారత్లోకి ప్రవేశించాడు. ఉరీకి చెందిన ఐరమ్ బానోతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో సరిహద్దు దాటి వచ్చిన అతడిని భారత సైన్యం అదుపులోకి తీసుకుని విచారించింది. ప్రేమ కోసం వచ్చినట్లు నిర్ధారణ కావడంతో నిబంధనల ప్రకారం అతడిని పాకిస్థాన్ అధికారులకు అప్పగించింది.

















