Telangana: ప్రజాపాలనా దినోత్సవంగా ‘సెప్టెంబర్ 17’

Telangana Government: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17ను ప్రజాపాలనా దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. కాగా, గత కొంతకాలంగా సెప్టెంబర్ 17 విషయంలో తీవ్రం గందరగోళం నెలకొన్ని విషయం తెలిసిందే. విమోచన దినోత్సవంగా ప్రకటించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్న వేళ తాజాగా, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17న జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా ఎగురవేయనున్నారు. అయితే 32 జిల్లాల్లో ఎవరెవరు జెండా ఎగురవేయాలనే విషయంపై ఇప్పటికే ప్రభుత్వం ఓ లిస్ట్ తయారు చేసింది.

Spread the love

Related News

Latest News