Trending Now

బీజేపీ తొలి లిస్ట్‌లో ‘నో’ ప్లేస్‌.. బీజేపీ సిట్టింగ్ ఎంపీ సంచలన కామెంట్స్‌

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: బీజేపీ హైకమాండ్‌ రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటు, తెలంగాణలో కూడా తొమ్మిది మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఈ క్రమంలో ఆదిలాబాద్‌ సిట్టింగ్‌ ఎంపీ సోయం బాపురావు పేరు తొలి లిస్టులో రాలేదు. ఆదిలాబాద్‌ గురించి హైకమాండ్‌ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక, తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో బాపురావు స్పందిస్తూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. తనకు లోక్‌సభ స్థానం నుంచి టికెట్‌ రాకుండా పార్టీ అగ్రనేతలే అడ్డుపడ్డారని సోయం బాపురావు సంచలన కామెంట్స్‌ చేశారు. నా బలం.. బలగం కావాలనుకుంటే పార్టీ టికెట్ ఇస్తుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Spread the love

Related News