Trending Now

మహానగరంలో నకిలీ వైద్యులు..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్‌లో నకిలీ వైద్యులపై వైద్య మండలి అధికారులు దాడులు చేశారు. శుక్రవారం రాత్రి వైద్య మండలి సభ్యురాలు డా. ప్రతిభ లక్ష్మీ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. అడ్డగుట్ట, తుకారాంగేట్, వెస్ట్ మారేడ్ పల్లిలో ఆకస్మిక తనిఖీలు జరిపి.. 10మంది నకిలీ వైద్యులను గుర్తించారు. వీరు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ.. వైద్యం చేస్తూ చలామణి అవుతున్నారు. ఒక్కో నకిలీ వైద్యుడు 20, 25, 30 ఏళ్లుగా వైద్యం అందిస్తున్నట్లు గుర్తించారు. జిల్లా వైద్యాధికారికి దీని గురించి నివేదిక అందించారు.

Spread the love

Related News