‘జూబ్లీ’ గెలుపు ప్రజాపాలన విజయం
బీఆర్ఎస్, బీజెపీ కుట్రలు చెల్లలేదు
పార్టీ శ్రేణులకు మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు
(ప్రతిపక్షం స్టేట్ బ్యూరో)
హైదరాబాద్, నవంబర్ 14: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలవడంపై గ్రామగ్రామాన సంబరాలు చేయాలని- మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఫలితమే ఈ విజయమని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేసాయన్నారు. గ్రామీణ ప్రాంతాలలో రైతులకు అండగా, పేద ప్రజలకు ఉచిత విద్యుత్, సన్న బియ్యం, రేషన్ కార్డులు, సున్నా వడ్డీ రుణాలు, ఉద్యోగాలు, రుణమాఫీ, రైతుభరోసాలాంటి కార్యక్రమాలు చేపట్టామన్నారు. జూబ్లీహిల్స్ గెలుపును ప్రతి కార్యకర్త తమ గెలుపుగా భావించి అంతటా సంబరాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.



























