ప్రతిపక్షం, జూలై 11: ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా ఆకలి తీరుతోందంటూ ఓ యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఆకలి తీర్చారని ఆ యువకుడు చెప్పిన మాటలు తనకు ఎంతో సంతృప్తినిచ్చాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ పేదవాడూ ఆకలితో ఉండకూడదనే సంకల్పంతోనే ఇందిరమ్మ క్యాంటీన్లను ప్రారంభించామని తెలిపారు. ప్రజల కడుపు నిండడం, వారి ముఖాల్లో చిరునవ్వు చూడటమే తనకు అన్నగా లభించే గొప్ప ఆనందమని సీఎం సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానించారు.



















