బస్తీ దావాఖానలు స్థానిక ప్రజలకుగుండె చప్పుడు లాంటివి: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే

ప్రతిపక్షం, జూలై 14: నేడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ డివిజన్‌లో ఉన్న బస్తీ దావాఖానను హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు సందర్శించి అక్కడ అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు..

దావాఖానకు ప్రతిరోజూ ఎంతమంది రోగులు వస్తున్నారు, వారికి అందుతున్న వైద్య సేవలు, చికిత్స ప్రక్రియ సక్రమంగా కొనసాగుతోందా అనే అంశాలపై వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకుని వివరాలను సమీక్షించారు. అదేవిధంగా రోగులకు నాణ్యమైన మందులు అందుతున్నాయా అనే విషయాలపై అధికారుల నుంచి సమగ్ర వివరాలు సేకరించి తగిన సూచనలు చేశారు..

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..
జీహెచ్‌ఎంసీ మరియు కలెక్టరేట్ అధికారులు బస్తీ దావాఖానలకు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు..అలాగే ఇందిరమ్మ క్యాంటీన్లు, బస్తీ దావాఖానలు నిరంతరం సమర్థవంతంగా నిర్వహించబడేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు..

బస్తీ దావాఖానలు హైదరాబాద్‌కు గుండె చప్పుడు లాంటివి. నగరంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్య సేవలు అందించే ఈ కేంద్రాలను మరింత బలోపేతం చేయడం ప్రభుత్వ లక్ష్యం అని వారు పేర్కొన్నారు..

ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా గారు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్నన్ గారు, ఖైరతాబాద్ ఎమ్మార్వో ప్రేమ్ కుమార్ గారు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియాంక గారు, బోరబండ డీసీ ఉమా గారు, ఈఆర్‌వో సురేష్ గారు, కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు..

Spread the love

Related News

Latest News