తెలంగాణలో ‘పెద్ది’ సినిమాకు టికెట్ ధరల పెంపునకు అనుమతి

ప్రతిపక్షం, జూన్ 03: తెలంగాణలో ‘పెద్ది’ సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సంబంధిత ఉత్తర్వులు జారీ అయ్యాయి.

సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరలను రూ.100 వరకు, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.125 వరకు పెంచుకునే అవకాశం కల్పించారు. అలాగే ప్రీమియర్ షో టికెట్లపై రూ.600 వరకు అదనంగా వసూలు చేసేందుకు అనుమతి ఇచ్చారు.

ఈ ధరల పెంపు సదుపాయం విడుదలైన తేదీ నుంచి 10 రోజుల వరకు మాత్రమే అమల్లో ఉండనుంది. ఇదిలా ఉండగా, సినిమా టికెట్ బుకింగ్స్ ప్రారంభమైనట్లు చిత్ర బృందం ప్రకటించింది.

Spread the love

Related News

Latest News