- 80,000 లంచం తీసుకుంటుండగా వల
- అటవీశాఖ కార్యాలయంలో కలకలం
ప్రతిపక్షం బ్యూరో, జూన్ 04, ఉమ్మడి కరీంనగర్: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో ఎఫ్తార్త్వో మొహినుద్దీన్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.ఒక బాధితుడి నుంచి రూ. 80,000 లంచం తీసుకుంటుండగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ నేతృత్వంలోని బృందం దాడి చేసి అదుపులోకి తీసుకుంది.ఈ ఘటనతో అటవీశాఖ కార్యాలయంలో కలకలం రేగింది. కేసు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి.

















