ప్రతిపక్షం, వెబ్డెస్క్: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ పర్యటనకు బయలుదేరారు. ముందుగా తిమ్మాపూర్, కరీంనగర్ రూరల్ మండలాల్లో ఎండిన పంటలను కేసీఆర్ పరిశీలిస్తారు. అనంతరం సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం, వేములవాడ నియోజకవర్గాల్లో రైతులతో మాట్లాడతారు.