రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలపై బీసీసీఐ కీలక ప్రకటన

ప్రతిపక్షం, జూలై 18: ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరగనున్న మూడో వన్డే అనంతరం భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతారన్న వార్తలకు బీసీసీఐ తెరదించింది. రోహిత్ రిటైర్మెంట్‌పై ఎలాంటి చర్చలు జరగలేదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.

లార్డ్స్‌లో జరగనున్న వన్డే రోహిత్ శర్మకు చివరి మ్యాచ్ కాదని ఆయన తెలిపారు. వన్డే జట్టులో రోహిత్ ఇప్పటికీ కీలక ఆటగాడని, జట్టులో ఉన్నంతకాలం దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూనే ఉంటారని పేర్కొన్నారు.

రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని బీసీసీఐ కార్యదర్శి స్పష్టత ఇవ్వడంతో అభిమానుల్లో నెలకొన్న అనుమానాలకు తెరపడింది. దీంతో ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో రోహిత్ ఆడటం ఖాయమని తెలుస్తోంది.

Spread the love

Related News

Latest News