Trending Now

ఎన్నికల ప్రచార రథాల ప్రారంభం..

ప్రతిపక్షం, సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 12: పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా ప్రచార రథాల ప్రారంభోత్సవ కార్యక్రమం పటాన్ చెరు మండలం రుద్రారం గణేష్ గడ్డ దేవాలయం వద్ద శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి, మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి కొండా సురేఖ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

దేవస్థానంలో ప్రత్యేక పూజలు..

ప్రచార రధ ప్రారంభోత్సవానికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, టీపీసీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, సంగారెడ్డి డిసిసి ప్రెసిడెంట్ నిర్మల జగ్గారెడ్డి, మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు గణేష్ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ చైర్మన్ వెంకన్న, సభ్యులతో కలిసి నీలం మధు ముదిరాజ్, జగ్గారెడ్డి, సంగారెడ్డి డిసిసి ప్రెసిడెంట్ నిర్మల, మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు లకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, సన్నాయి మేళాలతో దేవస్థానంలోకి ఆహ్వానించారు. వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం కమిటీ శాలువాలతో నేతలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, టీపీసీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, సంగారెడ్డి డిసిసి ప్రెసిడెంట్ నిర్మల, మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు లతో కలిసి జెండా ఊపి ప్రచార రథాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఎలక్షన్స్ పటాన్చెరు కోఆర్డినేటర్ శ్యామ్ గౌడ్, దేవస్థాన కమిటీ చైర్మన్ వెంకన్న, పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గ ఇంచార్జ్ లు, జిల్లా కాంగ్రెస్, బ్లాక్ కాంగ్రెస్, మునిసిపల్, పట్టణ, పలు గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News