మంచి తరుణం.. కీలక బిల్లులపై కేంద్రం అడుగులు

ప్రతిపక్షం, జూన్ 11: మహిళలకు శాసనసభలు, పార్లమెంటులో అధిక ప్రాతినిధ్యం కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన బిల్లులను పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ముందుకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో ఈ కీలక బిల్లుల ఆమోదానికి ఇదే సరైన సమయంగా కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.

దేశ రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పార్లమెంటులో బిల్లులకు మద్దతు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వివిధ పార్టీల రాజకీయ సమీకరణాలు మారుతున్న తరుణంలో కీలక సంస్కరణలకు కేంద్రం ప్రాధాన్యం ఇస్తోందని తెలుస్తోంది.

మహిళలకు శాసనసభలు, లోక్‌సభలో అధిక అవకాశాలు కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లు, జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన అంశాలు దేశ రాజకీయాల్లో చాలా కాలంగా చర్చనీయాంశాలుగా ఉన్నాయి. ఈ రెండు బిల్లులు అమల్లోకి వస్తే దేశ రాజకీయ వ్యవస్థలో గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

అయితే ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది దేశవ్యాప్తంగా ఆసక్తిగా మారింది.

Spread the love

Related News

Latest News